About This Event
గిరిజన గ్రామాలలో విగ్రహ ప్రతిష్ఠలు!
శ్రీ రామ్! జై జై శ్రీరామ్!!
దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంద్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కంఠరం పంచాయతీ అప్పన్నపాలెం గ్రామం ST కాలనీలో 6 సంవత్సరాల కిందట నిర్మించబడిన శ్రీ శ్రీ శ్రీ సీతారాముల వారి ఆలయంలో ఈరోజు ఉదయం 7:19 నిముషాలకు శ్రీ రామ సీత లక్ష్మణ హనుమాన్ స్వామివార్ల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది!
ఆలయం నిర్మాణానికి విగ్రహాలకు విగ్రహ ప్రతిష్టకు మరియు అన్నదానానికి సహాయ సహకారాలు అందజేసిన ప్రతి దాతలకు ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాము!
విగ్రహ దాతలు(దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు)
శ్రీ వైశ్యరాజు లక్ష్మణరాజు గారు శ్రీమతి వనజాక్షమ్మా గార్లు
శ్రీ వైశ్యరాజు మురళి శ్రీమతి జ్యోతి గార్లు
శ్రీ లాడి చంద్రశేఖరరావు శ్రీమతి ఉషారాణి గార్లు
ఇది గ్రామస్తుల ఆరేళ్ల నిరీక్షణ! విగ్రహాలు లేక విగ్రహాలను ప్రతిష్టించుకోలేక గ్రామస్తులు దానధర్మ చారిటబుల్ ట్రస్ ను సంప్రదించగా దానధర్మ చారిటబుల్ ట్రస్ సభ్యులు అయినటువంటి శ్రీ సారమండ లోవరాజు శ్రీ పొన్నపు రాజు గార్ల పర్యవేక్షణలో ఈ యొక్క పుణ్య కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది!
దాతలు ఎవరైనా దేవాలయాలలో ప్రతిష్టించే విగ్రహాలను దానం చేయాలి అనుకుంటే దయచేసి వివరాలకు 9533357997 సూర్య రాట్నాల గారిని సంప్రదించగలరు!
ఇట్లు
సూర్య రాట్నాల
9533357997
Daanadharma.org
Event Details
Date & Time
Wednesday, June 15, 2022
TEvent Type
Other
SStatus
Completed


